Tuesday, June 16, 2020

keelu gurramu story 1

చందమామ కథలు 


కీలు గుర్రము 
అనగా  అనగా  ఒక్క  నవాబు  ఉండేవాడు. ఆ  నవాబుకు  ఒక్కడే  కొడుకు  మరియు  ఒక్కతే  కూతురు.  కొడుకు  చాలా  సాహసి.  మిన్ను  విరిగి  మీద పడ్డా  జంకేవాడుకాదు. అతని  పేరు  ఫిరోజిషా.  కూతురు  పేరు  జహానారా. 

ఆ  నవాబు   ప్రతి  సంవత్సరం   వైభవంగా   పీర్ల  పండుగ  చేసేవాడు.  ఆ  ఉత్సవాలు  చూడడానికి  దేశ  దేశాలు  నుండు  రాజాకుమారులు, కవులు,  గాయకులు,  శిల్పులు వచ్చి   వాళ్ళ   విద్యలు చూసి  నవాబు  దగ్గర  బహుమతులు  పొందేవాళ్లు.  

ఆ  సంవత్సరం  ఉత్సవాలుకు   ఒక్క  ముసలి   శిల్పి  వచ్చాడు.  కానీ  ఇతర  శిల్పులు  ఆడే  బొమ్మలు, పాడెబొమ్మలు  ఇంకా  రకరకాల  ప్రతిమలు  తెస్తే,  కానీ  ముసలితాతా   ఒక్క  కొయ్య  బొమ్మ  గుర్రాన్ని  పట్టుకోచ్చాడు.  తాతను చూడగానే  అక్కడ ఉన్న  శిల్పులు  నవ్వసాగారు. 

"ఈ  గుర్రాన్ని   నువ్వే  చేసావా  తాతయ్య"  అని  అడిగాడు  ఒక్క  శిల్ప .  

"బలే  గుర్రం  తాతయ్య  ఇంతకీ ఇస్తావు గుర్రాన్ని"  అని  వెక్కిరించాడు  మరో  శిల్పి. 

"ఏమి  గుర్రం  మనుకున్నావురా   ఆది   దేవతగుర్రహ"  అని  అన్నాడు  మరి శిల్పి.  

తాతకి  కోపం వచ్చి  "మీరు  కొనలేరు,  మీ అబ్బలుకొనలేరు,  ఎందుకు  మీకు  వచ్చిన బాధ?  పోండి, పొంది"  అని  కసిరాడు. 

నవాబు  శిల్పులు  తెచ్చిన   బొమ్మలు   చూసి  మంచివాటిని   పుచ్చుకొని   అయా   శిల్పులు   తగిన   బహుమతులు  ఇచ్చాడు.  చివరికి  ముసలి  తాతా  కొయ్యగుర్రం   మిగిలింది.  "ఏంటి  దేని  విశేషం" అని  అడిగాడు  నవాబు. 

"మీరు  చిత్తగిస్తే   మనవి  చేస్తాను.  ఇది   వట్టి   చూపులగుర్రం   కాదు  కీలుగుర్రం.  కళ్ళు  మూసుకొని  తెరిచే  లోపుల   చుక్కలన్నీ  చూసివస్తుంది  అకాశం   ఆంతు  కనుకూస్తుంది.  అని  అన్నాడు  తాతా. "

"చుప్! చుప్!  అంతా  అబద్ధం   అల్లాంటిది  ఈ  భూలోకం  లోనే లేదు."  అని  అన్నాడు  నవాబు. 

"మీరు  అనుమతి  ఇస్తే  ఇప్పుడే  నేను  చేసి  చూపిస్తాను,"  అని అన్నాడు  శిల్పి .

"ఎక్కడ  పదోకాసుల  దూరంలో   చందంపర్వతం  ఉంది.  దాని  మీద   మసీదు.  మసీదుకు   పక్కన  ఖర్జురపు  చెట్టు  ఉంది .   పోయి   ఆ  చెట్టు  అకు  పట్టుకురా  చూస్తాను,"  అని అన్నాడు  నవాబు. 
ముసలి  శిల్పి  సరి అని  నవాబు  అనుమతి   తీసుకొని  గుర్రంమేక్కి  ఎదో  బుడ్డపు  లాగావున్న  మీద  నొక్కాడు.  గుర్రం ఇంకా అఘమేఘాలు  మీద  లేచింది.  అది అప్పుడు  వెళ్లి  ఎప్పుడు  వచ్చిందో  ఎవరికీ  తెలియదు.    నవాబు  తెప్పరిల్లి  చూచేసరికి  ఖర్జురపు  ఆకూ  పుచ్చుకొని  శిల్పి  ఎదురుగ  నుంచున్నాడు. 

నవాబు  ఎల్లాగయినా  ఆ  గుర్రం  కావాలి అని అనికున్నాడు.  "నీకు ఏమి కావాలి  అయినా కోరి  పుచ్చుకో.  నాకు  ఆ కీలు  గుర్రం  మాత్రం  కావాలి"  అని  అన్నాడు  నవాబు. 

"అయితే  నీ కుమార్తెను  నాకు  ఇచ్చి   పెళ్లి  చేయండి " అని  శిల్పి  అన్నాడు.  అక్కడ  ఉన్న వాళ్ళు  అంత  తెల్లబోయారు.  శిల్పి  మూడుకాళ్ళ   ముసలి  అందులో  పగలుచూస్తే   రాత్రి  కల్లోకి  వస్తాడు.  అల్లాంటివాడికి  చూస్తూ  చూస్తూ  రాజు  కూతురు  ఇంకా  పదహారేళ్లు  కూడా లేవు   ఎల్లా  ఇవ్వడం ?  అని  నవాబు  ఆలోచించాడు.  

నవాబు  కుమారుడు  పిరోజోషా  ఎన్నాడు ....  "నీవు  గరిడి  చేసావో  ఏమో  తెలియదు లేక,  ఆ  గుర్రంనికి   అంత  శక్తి  ఉందొ  తెలియదు.  ఇతరులు  ఎక్కుతే  పోతుందో  లేదో తెలియదు కదా" అని నేను  పరీక్షస్తా   అని  అన్నడు . 

ఫిరోజిష   ఎక్కడకో   వెళ్ళాలి   అని  కీలు  గుర్రం  ఎక్కి  మీటు నొక్కాడు.  ఆది  రివ్వున్న   లేచి, చూస్తుండగానే  ఆకాశం  లోకి  దూసుకుపోయింది.  నవాబు ,  అతని  బలగం  తెల్ల  బోయి  చుస్తునారు.  ఇంత  సాహసం  జరుగుతుంది అని ఎవ్వరు  అనుకోలేదు.   ఫిరోజిష  మల్లి  వస్తాడు  అని  ఎద్దురు  చుస్తున్నారు .  మధ్యాహ్నం  అయింది  ఆచూకీ  లేదు,  సాయంత్రం  అయింది  ఇంకా  రాలేదు,   ప్రొద్దుగూకింది  ఆనవాలు  లేవు అసలు.  నవాబుకి  పట్టరాని  కోపం  వచ్చింది.  శిల్పి  ఈ గుర్రం  తేవకుంటే  నా  కొడుకు  ఇలా  అయేవాడు  కాదుగా.   "వీణ్ణి  తీసుకెళ్లి   జైలులో  పెట్టండి  తరువాత   చూడం" అని  చెప్పాడు. నవాబు  శిల్పిని  తీసుకెళ్లి    జైలులో    తోసారు.

ఇంకా  ఫిరోజిషా  ఆ  కీలుగుర్రం  మీద  వాయువేగంతో  పైకిలేచాడు.  ఆ  వేగానికి  అతనికి  భయం  వేసింది.  తాను  ఎంత  ఎంతున్నా  ఉన్నడో  చూసాడు  క్రింద  ఎవ్వరు  కనిపివలేదు.  చెట్లు  కూడా  కానివిపవడం  లేదు.  తన  కోట  కూడా  కనిపించలేదు. కానీ  చంద్రగిరి  మాత్రం  చిన్న  పుట్ట  లాగా  కనపడింది. దానితో  అతని  కళ్ళు  తెరిగాయి.  గుర్రం  జూలు  మాత్రం  గట్టిగ  పట్టుకున్నాడు.   అది  ఆగకుండా  పైకిపోతుంది.  

ఫిరోజిషాకు   పెద్దలు  తలుపుకోచ్చారు  అల్లారుముద్దుగా  పేచిన  తండ్రి  గుర్తుకు  వచ్చారు.  రోజు  తనతో  ఆడుకుండే  చెల్లి  గుర్తుకువచ్చింది  అల్లాగే  స్నేహితులు  గుర్తుకువచ్చారు. అతనికి  భయం  ఎక్కువ  అయింది  కళ్ళు  ఇంకా  గట్టిగ  మూసుకున్నాడు.  కానీ  గుర్రం  వాయువేగంతో  దూసుకుపోతుంది.  

ఇల్లా  కొంతసేపు  పోగా   పోగా  ఫిరోజిషాకు  జూడుపు  తాగింది.  గుర్రాన్ని  ఎల్లా  కిందకి  దించండం  ఆలోచించాడు.   ఎక్కడో  దానికి  మరొక మీటు  ఉండితీరాలి  అనుకున్నాడు. జూల్లాలో  వెతికాడు  కానీ  కనపడలేదు.  జీను ప్రక్కన్న చీలలు  తిప్పి  చూసాడు  కానీ  లాభం   లేకపోయింది.  చివరికి  విసుగెత్తి  దాన్ని  రెండు  చెవులు  పట్టుకున్నాడు .  అప్పుడు  గుర్రం  వేగం  తగ్గి  నెమ్మదిగా  కిందకి  దిగసాగింది.  అప్పుడు  తన  ప్రాణాలు  కుదుటపడ్డాయి.  అల్లా  కిందకి  దిగి  దిగి  చివరికి  ఆరు అంతస్తులు  మేడా మీద  వాలింది. 
అప్పిటికే   బాగా  ప్రోడుకుపోయింది.

No comments:

Post a Comment

Thanks for visiting this site ....