మహా భాగవతం
గజేంద్రమోక్షము
గజేంద్రుడు తన పూర్వ జన్మలో మహా ఘన వైష్ణవుడైన ఇంద్రద్యుమ్నుడు. అతడు పాంఢ్య దేశానికి రాజుగా ఉండేవాడు. రాజ్య పరిపాలనను పూర్తి చేసిన తరువాత ఇంద్రద్యుమ్నుడు వానప్రస్థాన్ని స్వీకరించి మలయచలానికి వెళ్లి ఒక పర్ణసాలలో నివసించాడు. ఒక రోజు దేవుని ఆరాధనలో నిలిచిన ఇంద్రద్యుమ్నుడు తరచుగా ధ్యానమగ్నుడై ఉండేవాడు .ఒక సారి అతడు పూర్తిగా సమాధిమగ్నుడై ఉన్న సమయం లో అగస్త్యముని శిష్యసమేతంగా అక్కడకు వచ్చాడు .తనకు సత్కారాలు చేయకపోవడం చూసి క్రుద్దుడై "బ్రాహ్మణుని అవమానించాడు కాబట్టి జడబుద్ధి కలిగిన గజదేహము కలుగుగాక !" అని తీవ్రంగా శపించాడు .
ఏనుగుకు ఎంత శారీరక బలం ఉన్నా బుద్ధిబలం లేకపోవడం వలన మనిషికి లొంగిపోయి ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు భక్తుడు కాబట్టి జరిగినదంతా భాగవద్ లీలా గ భావించాడు. తదుపరి జన్మ లో ఏనుగుగా పుటినప్పటికీ భగవత్ నామాన్ని మరువలేదు. గజేంద్రుడు త్రికూట పర్వత అరణ్యాలలో తన పరిజనులతో నివసించేది. రమ్యమైన ఆ ప్రాంతములో ఒక మనోహరమైన మహాసరోవరము ఉన్నది .అది పుష్పభరితమై ఉండేది .ఆ సరోవరంలో హంసలు, చక్రవాకాలు ,నీటికోళ్ళు, వంటి ఎన్నో జలజంతువులు ఉండేవి .
ఏనుగుకు ఎంత శారీరక బలం ఉన్నా బుద్ధిబలం లేకపోవడం వలన మనిషికి లొంగిపోయి ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు భక్తుడు కాబట్టి జరిగినదంతా భాగవద్ లీలా గ భావించాడు. తదుపరి జన్మ లో ఏనుగుగా పుటినప్పటికీ భగవత్ నామాన్ని మరువలేదు. గజేంద్రుడు త్రికూట పర్వత అరణ్యాలలో తన పరిజనులతో నివసించేది. రమ్యమైన ఆ ప్రాంతములో ఒక మనోహరమైన మహాసరోవరము ఉన్నది .అది పుష్పభరితమై ఉండేది .ఆ సరోవరంలో హంసలు, చక్రవాకాలు ,నీటికోళ్ళు, వంటి ఎన్నో జలజంతువులు ఉండేవి .
ఒక రోజు గజేంద్రుడు తన పరిజనులతో కలసి సరోవరానికి వెళ్ళింది .. తన పరిజనులతో స్నానం చేస్తుండగా విధివశాత్తు ఒక భయంకరమైన మొసలి దాని కాలును పట్టుకొంది. గజేంద్రుడు మొసలితో పోరాడడం మొదలు పెట్టాడు. మొసలి గజేంద్రుడుని నీటిలోకి లాకొని పోవాలి అని , గజేంద్రుడు మొసలిని ఒడ్డుకి ఈడ్చుకోరావాలిఅని
ఇలా 1000 సవత్సరాలు యుద్ధం చేసుకున్నాయి . గజేంద్రుడి పరిజనులు ఏమిచేయలేక చుస్తూ వుండిపోయారు . ఇక చేసేది ఏమి లేక ఆ దేవదేవుడిని స్తుతించాడు . "అన్ని జీవులకి సృష్టికర్త, నియంత్రిచగల ,శక్తి కేవలం ఆ దేవదేవునికి తప్పా మరి ఎవరికీ లేదు ",కాబట్టి ఆ దేవదేవుడే నన్ను రక్షించగలడు అని "జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం" గజేంద్రుడు జపించడం మొదలుపెట్టింది ..
దేవదేవుడు కరుణామయుడు భక్తితో అర్తిస్తే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు గజేంద్రుని శరణు విని దేవదేవుడు శంకచక్రగదాధారిని ధరించి పక్షి రాజైన గరుడారూఢుడై భగవంతుడు గజేంద్రుని ముందు ప్రత్యేక్షమైయ్యాడు . గరుడవాహనంఫై తనను రక్షించడానికి చక్రధారి అయినా నారాయణుడు ఆకాశం లో దర్శనమివ్వగానే గజేంద్రుడు తొడముతో ఒక పద్మమును పైకెత్తి సమర్పిస్తూ "నారాయణా !దేవదేవా !జగన్నాథా !ఇదే నీకు నా వందనలు " అని గొంతెత్తి పలికింది.
తన భక్తునికి కలిగిన కష్టాన్ని భగవంతుడు చూసి శీఘ్రమే మొసలితోపాటు గజేంద్రున్ని ఒడ్డు పైకి లాగి అందరి సమక్షంలో చక్రాయుద్ధంతో మొసలిని ఖండించాడు . గజేంద్రుము కష్టం నుండి బయటపడింది . గజేంద్రరక్షణాన్ని చూసి సమస్త జగత్తు పులకించింది .పూర్వం మొసలి హుహు అనే గంధర్వుడు ఋషి శాపం వల్ల మొసలిగా మారి ఆ సరోవరం లో నివసించ సాగేది, విధివశాత్తూ దేవదేవుని చక్రస్పర్శ కి గురైయింది.
దేవదేవుని చక్రస్పర్శ వలన మొసలి తన పూర్వ దేహాన్ని పొంది గంధర్వలోకానికి వెళ్ళింది .గజేంద్రుడు కి దేవదేవుని స్పర్శ వల్ల ఆధ్యాత్మిక దేహం లభించింది . ఆధ్యాత్మిక దేహం పొందిన తరువాత విగ్రహారాధన వల్ల గోలోకానికి చేరుకొన్నాడు .
"భగవంతుడిని భక్తి తో అర్చిస్తే ఏ రూపం లోనైనా ఆపదల నుంచి ఆదుకుంటాడు అనడానికి నిదర్శనం ఈ గజేంద్రమోక్షము".



Super
ReplyDeletethanks alot...
Delete