Friday, July 5, 2019

Keelu Gurram part 2

 కీలు గుర్రం 2


ఫిరోజిషా  మేట్లు  దిగి  ఏడో  అంతస్తుకు  వెళ్ళాడు  అతనికి  అక్కడ  సంగీతం  వినపడింది.  ఆ   శబ్దానికి  అక్కడికి  వెళ్ళాడు  మరకత   మాణిక్యాలుతో   దగ దగ  మెరుస్తుంది.  ఒక్క  పెద్ద  గది  లోపలకు  వెళ్ళడు.   అక్కడ  ఒక్క  హంసతాలుకా  తల్పంమీద   ఒక్క  రాజకుమార్తె  పడుకోనివుంది  ఆమె  చుట్టూ  చెలికెతులు  పడుకొని  నిద్రపోతున్నారు.  ఫిరోజిషా  తన  కళ్ళు  తాను  నమ్మలేక  పోతున్నాడు.  కలగంటున్నాను అని అనుకున్నాడు .  తన  వళ్ళు   తానే   గిచ్చుకున్నాడు  బాధ  తెలుస్తుంది  అని  అపుడు అంత  నిజం  అనుకున్నాడు.  

మళ్ళి   ఒక్కసారి   రాజకుమార్తె  వైపు  చూసాడు.  చుక్కల  మధ్య  చెంద్రుడులా  ఉంది.  బంగారపుజూటు  లాగా తళా  తళా  మెరుస్తోంది.  రాజపుత్రిక  కళ్ళు  తెరిచి  అతని  చూసింది.   

ఫిరోజిషా  ఆమె  పక్కకు  తీసుకెళ్లి  మొత్తం కదంతా  చెప్పాడు.  తనతో  పర్షియాకువచ్చి  నన్ను  పెళ్ళాడుమని  ప్రార్థించాడు.  వంగపుత్రిక  కూడా  అతని ప్రేమిచ్చింది. ఇంకా  రెండో  వాడికి  చెప్పకుండా  అతనివెంట  అతనివెంట  బయలుదేరింది.  ఇద్దరు  కీలు  గుర్రం  ఎక్కి  పర్షియాలో   తమ  పట్టణంలో   అడుగుపెట్టింది. 

మేళా తాళాలు,  బాజాభజింత్రిలు  లేకుండా  కొత్త   పెళ్లి  కూతురును  అంత:  పురాణకి  ఎల్లా  తీసుకోపోవడానికి  ఫిరోకిషాకు  మనసు  రావడం  లేదు.   రాజా  పుత్రికకు  ఇప్పుడే  వస్తానుఅని  చెప్పి  రాణి  గుర్రాన్ని  అక్కడే  తోటలోని   బంగలోని   దింపి  ఒక్కడే  ఇంటికి   వచ్చాడు.  

అప్పుడు  నవాబు  సంతోషానికి  అవధులు  లేక  పోయింది.  వెంటనే  శిల్పిని  విడుదల  చేయిచారు.  రాజపుత్రికని  తీసుకు  రావడానికి  పయత్నాలు  ప్రారంబమయ్యాయి.  ఈ  సంగతి అంత  శిల్పి  విన్నాడు. గుప్పుడు  చప్పుడు  లేకుండా  అక్కడకి  వెళ్లి,  "మేమ్ము  ఈ   గుర్రముమీద  అంత:  పురాణకి  తీసుకు  రమ్మని  చెప్పారు."  అని   నమ్మి  ఆమె  కీలు  గుర్రం  ఎక్కి  వెళ్ళిపోయింది. 

శిల్పి  ఎక్కినగుర్రం  పోయి  పోయి  గ్రీకు  దేశం  లో   ఒక  మైదానం  లో  దిగింది. రాజా కుమారి  శిల్పి  చేసిన  మోసం తెలుసుకొని  ఏడువ  సాగింది. ఆ  ఏడుపు  వేటకు  వచ్చిన  గ్రీకు  మహారాజుకు  వినపడింది.  అతడు  చప్పున  వచ్చి  జరిగిన  మోసం  చూసి  శిల్పి  తల  నరికి వేసాడు.  

గ్రీకురాజు  కూడా  వంగరాజు  పుత్రిక మీద ప్రేమ  పుట్టుంది. కానీ  అది  ఏ  మాత్రం  ఇష్టం  లేదు.  రాజు  బలాత్కర0 నుంచి  తప్పుకోటానికి  పిచ్చి  పట్టినట్టు  నటించింది.  దగరికి  వెళ్తే  రక్కేది,  పీకేది. రాజు  ఎంతో  బాధాపోయాడు.  ఆమె  పిచ్చి  నయం  చెయ్యడనికి  చాల  మంది  వైద్యులను  రపించాడు .  కానీ ఆమెకి  పిచ్చి  తగ్గలేదు.  నిజానికి  అసలు  పిచ్చి అయితే కదా ?.  

అక్కడ  అల్లా జరుగుతుండగా    అక్కడ  పర్షియాలో   కాలినడకను  బయలుదేరిన   ఫిరోజిషా   ఉర్లుదాటాడు. అల్లా  చేమలు  దురని  చిట్టి  అడివినీ,  కాకులు  దూరని  కారాడివి  దాటాడు.  ఎక్కడ   తన   రాజపుత్రిక  కనపడలేదు.  ఏరులు  దాటాడు,  నదులు  దాటాడు,  గట్టులు  అల్లాగే  మీట్టలు  ఎక్కాడు, చివరకు  గ్రీకు  దేశానికీ  చేరుకున్నాడు.  అక్కడ  రాజు  పుత్రిక   సంగతి  విన్నాడు. 

ఫిరోజిషా  వైద్యుడు  వేషంలో  రాజు  దగ్గరకి  వెళ్ళి  "నాకు  బూతావైద్యం  తెలుసు  అని  రాజపుత్రిక  పిచ్చి  కుదిరిస్తా  అని  చెప్పాడు."  రాజు  సంతోషించి  అతన్ని  అంత:పురానికి  తీసుకెళ్లాడు. కొత్త  వైద్యున్నీ  చూడగనే   రాజా  కుమారి  పిచ్చి   కొంచం  తగిపోయింది. 

"రాజా,  ఈ  అమ్మాయికి   ఒక్క  కీలు  గుర్రంమూలాన  ఈ  వ్యాధి  కలిగింది   ఈ   మెను   ఆ  గుర్రం  మీద  ఎక్కి0చి  చుట్టూ  గుగల  దీపం  వేయాలి , మంత్రాలు  చదవాలి .  అప్పడుగాని  ఈ వ్యాధి  పూర్తిగా  పోదు.  పదిఏళ్లు  ఇస్తే   కీలుగుర్రం  చేస్తాను. " అని  అన్నాడు  ఫిరోజిషా . 

"ఈ  భాగ్యానికి   పది  సంవత్సరాలు  ఎందుకు.  మన  డాగర ఒక్క  కీలుగుఱ్ఱం  ఉంది  దానితో  చికిత్స  చేయి".  అని  అన్నాడు  రాజు . 

ఫిరోజిషా  పాచిక  పారింది.  రాజు  కుమారిని   కీలుగుఱ్ఱం  ఎక్కిఇంచి  చుట్టూ   దట్టంగా  గుగ్గిలం   దీపం   వేయించాడు.  ఆ  పొగలో  తనుకూడా  కీలుగుర్రం   పై  ఎక్కాడు.  మీటు  నొక్కాడు  వాయు   వేగం  తో  కీలు  గుర్రం   అక్కశంలోకి  ఎగిరి  పోయింది. 

ఫిరోజిషా  బెంగాలు  రాకుమారితో  క్షేమంగా   ఇంటికి  చేరాడు .  వారి  ఇద్దరికి  వైభవంగా  పెళ్లి   జరిగింది.  పెళ్ళినాటి   రాత్రి  బెంగాలిరాకుమారి   కీలుగుర్రన్నీ  తగలపెట్టించింది.  దానితో   వాళ్ళ  కష్టాలు  తీరిపోయాయి.  హాయిగా  రాజ్యం   ఏలు  కుంటూ  నురుఏళ్లు  బ్రతికారు . 

No comments:

Post a Comment

Thanks for visiting this site ....