Monday, July 15, 2019

Lord Puri Jagannatha Story Part 2

శ్రీ జగన్నాథ లీలలు 

శ్రీ జగన్నాథుడు ఈ  జగత్తులో  ఆవిర్బవించడానికి  మూల కారణం  అతని  ప్రియా  భక్తుడైయినా  ఇంద్రమన్యడు   మహారాజు.  ఆ రాజుకు ఉన్నట్టి  ఏకైక లక్ష్యం  భగవంతుడిని  ముఖా ముఖి చూడడం!.  ఆ  లక్ష్యం   తప్ప అతనికి జీవితంలో మరొక  కార్యమే  కానీపించలేదు.   ఇంద్రమన్యడు  ఎప్పుడూ  ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచింస్తుండేవాడు. 

"ఆహా ! భగవంతుడి  అనుగ్రహం  వలన   నేను  అన్ని  దిక్కులను  జయి0చాను.  నాకు  అపారమైన  సంపదలు లభించాయి.  రాజులందరు ఎంతో శ్రద్ధతో  నాకు  సాయంగా కొనసాగుతున్నారు.  మనషి కోరుకునే సమస్తం  నాకు  ఉన్నప్పటికీనీ  ఇంకా  ఎదో  వెలితి  నన్ను పట్టి  పీడిస్తో0ది.  అసలు నా మనసు  ఎందుకు  చింతాక్రాంతమై  ఉందొ నా  రాణి,  మంత్రులు, అందరికి  అర్థం  చేసుకోలేకపోతున్నారు.  ఈ  జగత్తులోని  వ్యవహారాలలో  ఉన్న  సూన్యత్వం  అర్థం  చేసుకోలేకపోతే  నాలో  ఉన్న  తీవ్రమైన  తాపన  వాళ్లకు  ఎల్లా  అర్థం అవుతుంది?  పరమ పురుషుడైన  దేవ దేవుడిని  చూడాలనేదే  నా  ఏకైక  కోరిక,  ఏకైక  ఆశయం.  ఆహా !  నా  కళ్ళతో  నేను  స్వయంగా  ఆ  దేవ దేవుని  ముఖా ముఖి  చూడగలగాలి.  నాకు  రాజ్యం  వద్దు,  స్వర్గం  వద్దు !  అందరు నన్ను చూసి  పిచ్చివాడిని అనుకున్నా  పరవాలేదు.  ఏఈ రోజు  నేను  ఒక్క  ప్రతిజ్ఞ  చేస్తున్నాను.  నా మనసు,  వాక్కులు, ఆలోచనలు,  కార్యాలు  అన్ని  కూడ  పరతత్వమైన   భగంతుని  చూసిందేకే  నేను  వినియోగిస్తాను. "  

ఇంద్రమన్యడుని  గురించి  అతని  సేవాని  యుద్ధవీరుడు,  పురోహితుడు  విద్యాపతి  చేర్చుకుంటూ  రాజులో  కలిగిన  మార్పు  గురుంచి కలతచెందారు.  రాణి  కూడ  రాజు గారి వ్యవహారం  పట్ల  కలత  చెందుతుందని  వారు   అనుకున్నారు. 

"రాజు గారు గురుంచి కొన్ని పుకార్లు  గాలిలో  తేరుగుతున్నాయి.  వాటి  గురించి  నీతో  మాట్లాడుదామని  అనుకుంటున్నాను "  అని  విద్యాపతి  అన్నాడు. 
"అయ్యా!  నీవు  ప్రధాన  పురోహితువి.   ఆ  విషయ0  నీకే  తెలియక  పోతే  ఇంకా ఎవరికీ  తెలుస్తుంది."  అని యుద్ధవీరుడు  నవ్వుతూ  అన్నాడు.. 

"మనిషి కళ్ళు మూసుకొని,  నోరు  మూసుకొని  కూర్చొని  ధాన్యం  చేస్తుంటే  అతని మనసులో  మాట  దేవుడికి  తప్ప  ఇంకా  ఎవరికీ  తెలుస్తుంది"  అని  విద్యాపతి అన్నాడు. 

"బహుశా  రాణికి  తెలుస్తుందేమో"  అని  సేనాని  అనగానే  విద్యాపతికి  వెంటనే ఒక్క  పద్యం  గుర్తుకు వచింది. 
"వెలిగే   సూర్యనికి  తెలియని  దేముంటుంది?
బుషులకు  వెల్లడి గని  సత్యము  ఏముంటుంది?
ఆకాశానికి  వినపడిని  శబ్దం  ఏముంటుంది?
భార్య  చెంత  దాచే  రహస్యం  ఏముంటుంది?" అని   విద్యాపతి  చెలాకీగా  అన్నాడు. 
ఆ  పద్య0  విద్యాపతి  చేపకగానే  ఇద్దరు  కాసేపు  కాసేపు  హాయిగా  నవ్వుకున్నారు.  తాను  ఒక్కసారి  ఇంద్రమన్యడు  మహారాజు  దగ్గరకు  వెళ్లి  అసలు  విషయం ఏంటో  జాగ్రత్తగా  గమనించి  వస్తానని  విద్యాపతి  అప్పుడు  చెప్పి  నేరుగా  ఉద్యానవనానికి  వెళ్ళాడు.  అక్కడ  రాజు  ఒంటరిగా  కూర్చొని   ఏవో  తనలో  తానే  మాట్లాడుకోవడం  విద్యాపతికి  కనిపించింది.  రాణి  అనుకుందాంతా  సత్యమేనని  అతనికి  అర్థమై0ది.  నిజానికి  రాణి  ఉహించనదాని  కంటే  సమస్య  ఇంకా  గంబిరంగా  ఉందేమోనని  విద్యాపతికి  అనిపించింది.  ఆ  విధంగా  ఆలోచిస్తూ  అతడు  నెమ్మదిగా  రాజు ముందుకు  వచ్చాడు.  అతనిని  చూడగానే   ఇంద్రమన్యడునికి  అన0డం  కలిగింది.  ప్రేమతో  ఆ  రాజు  అతనిని  ఆలింగనం  చేసుకున్నాడు. 

"విద్యాపతి! ఎక్కడ  నుండి  వస్తున్నావు? " అని  రాజు  కుతూహలంగా  అడిగాడు.

"నేను  ఇప్పుడు గుడికి  వెళుతూ  దారిలో  మిమ్మల్ని  చూసి  ఆగాను"  అని విద్యాపతి అన్నాడు. 

"ఆహా!  మీ  వంటి బ్రాహ్మణులు  ఎంతో  బాగ్యవ0తులు.  ఎప్పుడు  మీరు  భగత్ సేవలోనే  ఉంటారు.  మీ ఇంట్లో  నిత్యాగ్నిహోత్రం  చక్కగా  సాగుతుందా?"  అని రాజు  అడిగాడు.  "రాజు!  మీ  అద్భుతమైన  పాలనలో  సురక్షతంగా  ఉన్న  మాకు  ధర్మపాలనలో  లోటు వస్తుందా?  మేమంతా  ప్రశాంతగా ఉన్నాము.  అయినా  ఒక  మాట  మిమ్మల్ని  అడగాలి.  మీ  గురించిన చింత కొందరిలో  బాగా  పెరుగుపోయింది."  అని  విద్యాపతి  నెమ్మదిగా  అన్నాడు. 

"నా  గురించా?  ఏంటి  కారణం?"  రాజు  కాస్త  తీవ్రంగా  ప్రశ్నించాడు. 

"ఈ  మధ్య  మీరు  కాస్త  పరధ్యానంగా  ఉంటున్నారని,  అది  అసాధారణంగా  ఉందని  మీ స్నేహితులు  అనుకుంటున్నారు" అని విద్యపతి  అన్నాడు. 

"ఆ విషయాన్ని నేను కందునను. ఈ మధ్య నాలో చాలా పెద్ద మూర్పు వచ్చింది. భగవన్మందిరంలో  దేవదేవుని గురించే పదేపదే ఐనధంతో  నాలో శ్రద్ధ  రగులోకొంది .  అదే  నేన్ను త్రివరంగా  దహిస్తుంది."  అని ఇంద్రమున్నాడు అన్నాడు.
"కానీ  దాని  ఉదేశ్యం  మీరు  మీ కర్తవ్యాన్ని  వదిలి పెటాలిని  కాదు కదా? "  అని విద్యాపతి  సూటిగా  ప్రశ్మించాడు.

"ఆ  మాట  ఎవ్వరు అన్నారు?  ఈ  మధ్యకాలంలో  నేను  సభకు  వెళ్లి చాలా  రోజులు  అయి  ఉండవచ్చు.  కానీ  నా "భాద్యతలను  నేను  ఏనాడూ  విస్మరించలేదు.  నా  కర్తవ్యాలను  నేను  నిర్వహించే  తీరుతాను.  కానీ కేవలం  ఆదే  నాకు  సంతృప్తిని  ఇవ్వదు.  గురువర్యుడైయన  భగవంతుండిని  నేను  కళ్లారా  చూడనతవరకు,  ఆ  దేవదేవున్ని  పాదపాద్మలను  నా  చేతులతో  పట్టుకోనంతవరకు  నా  రెప్పలు  ఆరవు .  నా  హృదయం  చల్లారదు"  అని  రాజు  ఉద్వేగంతో  అన్నాడు. 

"రాజా!  నీ  మాటలు  మరీ  విడ్డూరంగా  ఉన్నాయి.  విష్ణువు  మూలోకాలకు  ఆవల  ఉంటాడు.  ఆ   దేవదేవున్ని  దర్శనం  కలుగుతుంది  అని  ఉహించుకున్నావు?  మహాశక్తీవంతులైన  యోగులే  తమ  తీవ్రమైన  ధ్యానంతోనైనా అతని క్షణకాలం దర్శనం  పొందలేకపోతున్నారు.  అది  నీకు  తెలియదా? "  అని  విద్యాపతి  పంతమాడే  ధోరణిలో  చెప్పసాగాడు.    
"అదంతా  నాకు  తెలియదు.  కానీ  నా   నిశ్చయం  మాత్రం  ఒక్కటే.  అందుకే  ఇవాళ  నేను  సభకు  వెళ్లి  అందరికి  ఒక్క  విషయం అడగాలని  అనుకుంటున్నాను.  భగవంతుండిని    ముఖా మూఖీ  ఎల్లా   చూడవచ్చో  ఎవరైనా  నాకు  చెబుతారేమో?"  అని  రాజు  ఆశగా  అన్నాడు. 

ఈ  విదంగా  కాసేపు  మాట్లాడుకొని  రాజు,  విద్యాపతి  నేరుగా  సభా గృహానికి   వెళ్లారు.  రాజు  సభలో  ప్రవేశస్తున్నాడని  తెలుసుకోగానే  అందరు  లేచి నిలపడ్డారు.  వందిమాగధులు  రాజునూ  కీర్తిస్తూ  సోత్రాలు  చేసారు.  రాజు  నడిచే  దారిలో  సేవకులు  పూలు  చల్లారు,   
పరిచారకులు  నీవేనలు  విసిరారు.  "సభికులారా,   మంత్రులారా,  నందిమదిగులారా!  మీ   అందరికి   నా  కృత జ్ఞతలు. ఈ  రోజు  నా  హృదయంలోని  మాటలను  మీకు  చెబుదామనే  నేను  సభలో  ప్రవేశంచాను.  ఎవరైనా  నా  ప్రశ్నకు  సమాధానం  చెప్పగలతే  నేను  అతనికి  సర్వదా  బుణపడి  ఉంటాను"  అని  ఇంద్రమన్యడు  వినయంతో  పలికాడు . 

"రాజా!  మీ  మనస్సులోని   మాట  చెప్పండి.  మిమ్మల్ని  సేవచిండానికి  మేము  సిద్ధంగా ఉన్నాము."  అని  సభికులందరు  ముక్తకంఠంతో  పలికారు. 

"భగవంతుని    దయ  వలన  నాకు  నాకు  ఇప్పడు  దేనికి  లోటు  లేదు. రాజ్యము,  సంతోషం, సంపదలు,  శక్తీ, బలము,  గౌరవము  అన్ని  నాకు  అపారంగా  ఉన్నాయి.  అయినా  నేను  దరిద్రుడుననే,  ఏమి  లేని  బిచ్చగాడిననే  నాకు  అనిపిస్తుంది."  అని  ఇంద్రమాన్యడు  గంబిరంగా పలికాడు.  అందరు  ఆశ్చర్య పోయారు.  వారికీ  నోటమాట  రాలేదు ... 

No comments:

Post a Comment

Thanks for visiting this site ....